ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం !
తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. భద్రాద్రి(డీ) దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 15న ప్రారంభం కానుండటంతో ఈ నెల 11న మంత్రి సమక్షంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.