నోటి పూత - జామ ఆకుల కాషాయం !
పిల్లలు నుంచి పెద్దల వరకు చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో నోటి పూత కూడా ఒకటి. నాలుక, దవడలు, పెదాలపై పండ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పికి గురిచేస్తాయి. నోటిపూత వల్ల తినడం, తాగడమే కాదు మాట్లాడటం కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. శరీరంలో వేడి ఎక్కువ కావడం, పోషకాల కొరత, డీహైడ్రేషన్, హార్మోన్ల అసమతుల్యత తదితర కారణాల వల్ల నోటి పూత ఏర్పడుతుంది. దీనిని జామ ఆకుల కాషాయం ద్వారా తగ్గించుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక నాలుగు జామ ఆకులను ముక్కలుగా తుంచి వేసుకుని దాదాపు పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జామాకుల వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ లో వన్ టేబుల్ తేనె కలిపి తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఈ జామాకుల కషాయాన్ని కనుక తీసుకుంటే నోటి పూత సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. నోటి పూతను వదిలించడానికి ఈ కాషాయం చాలా బాగా సహాయపడుతుంది. పైగా ఈ కషాయాన్ని తాగడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం వంటి సమస్యలు తగ్గుతాయి. నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. అంతేకాదు ఈ కషాయం జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యను నివారిస్తుంది. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పికి చెక్ పెడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. మరియు ఈ కషాయాన్ని తాగడం వల్ల ఒంట్లో వ్యర్ధాలు సైతం బయటకు తొలగుతాయి.