బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓ సూపర్ ఆఫర్ రూ.249 ప్లాన్ !


యిర్‌టెల్‌, జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ) రీఛార్జ్‌ రేట్లను భారీగా పెంచేశాయి. దాదాపుగా 26 శాతం ధరలను పెంచాయి. పెరిగిన ధరలు జూలై 04వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ లకు షాక్ ఇస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓ సూపర్ ఆఫర్ ను తీసుకువచ్చింది. కొత్త రూ. 249 ప్లాన్‌ను ప్రారంభించింది. దీనిలో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్, మొత్తం 90GB డేటా, రోజుకు 2GBకి సమానం, రోజుకు 100 ఉచిత SMSలు పొందవచ్చు. వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఆఫర్ ను తీసుకువచ్చి్ంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ ధరలను పెంచడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్‌ను ప్రవేశపెట్టి కస్టమర్ల పట్ల తమకున్న నిబద్దతను చాటుకుంటుంది. అంతేకాకుండా వేరే కస్టమర్లను తమ వైపు అట్రాక్ట్ చేస్తుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org