జగనన్న విద్యా కానుక పేరు స్టూడెంట్ కిట్టుగా మార్పు !
జగనన్న విద్యా కానుక పేరును మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగనన్న విద్యా కానుక బదులుగా విద్యార్థి (స్టూడెంట్) కిట్టుగా మార్పు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలపై ఉండే కవర్లలోనూ జగన్ ఫోటోలను తొలగించారు. ఏపీ ప్రభుత్వ రాజముద్రతో కవర్లు రూపొందించారు.