పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
పశ్చిమ బెంగాల్ లో మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. రాత్రికి ఫలితాలు వెల్లడవుతాయి. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు తమ పదవీ కాలం ముగియక ముందే రాజీనామాలు చేయడం వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. కిందటి నెల 8న సుఖేందు శేఖర్ రాయ్, 10న సుస్మితా దేవ్, 11న ప్రకాష్ చిక్ బరాక్ తమ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారు. అవి ఆమోదం పొందాయి. ఈ ఎన్నికల ద్వారా నూతనంగా ఎంపికయ్యే ఎంపీలు 2029 ఆగస్టు, 2030 ఏప్రిల్ వరకు సభ్యులుగా కొనసాగుతారు. ఉప ఎన్నికలను ఎటువంటి వివాదాలు లేకుండా, అత్యంత పారదర్శక పద్ధతిలో నిర్వహించడానికి, పోలింగ్ పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక పర్యవేక్షక బృందాలను రంగంలోకి దించనుంది. నిష్పక్షపాత వాతావరణంలో ఈ కీలక ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా సరిపోవు భద్రతా సిబ్బంది, ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నట్లు అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.