బహ్రెయిన్లో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి నిజామాబాద్ జిల్లా వాసి మృతి
బహ్రెయిన్లోని దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో నీటిలో మునిగి నిజామాబాద్ జిల్లాకు చెందిన తోట శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. అతను బహ్రెయిన్లోని ఏఎంసీ సంస్థలో ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా 2019 నవంబర్ 26వ తేదీ నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా సముద్ర తీరానికి వెళ్లిన అతను ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న బ్రహెయిన్ కోస్ట్గార్డు బృందాలు ఘటనాస్థలికి చేరుకు సహాయక చర్యలు చేపట్టాయి. కానీ లాభం లేకుండాపోయింది.