ఎయిర్టెల్ ప్రయారిటీ 5జీ రాకతో ప్రీపెయిడ్ యూజర్లకు నెట్వర్క్ స్పీడ్ తగ్గుతుందా ?
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 'ప్రయారిటీ 5జీ' ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో రద్దీ సమయాల్లో, జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రీపెయిడ్ యూజర్లకు నెట్వర్క్ స్పీడ్ తగ్గుతుందేమో అన్న ఆందోళన మొదలైంది. సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, టెలిగ్రామ్లలో దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. టెలికాం రంగంలో ఇంటర్నెట్ సేవలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయని ఈ మార్పులు సూచిస్తున్నాయి. పోస్ట్పెయిడ్ ప్లాన్లలో డేటా కోసం ప్రత్యేక 'ఫాస్ట్ లేన్స్' అందుబాటులోకి వచ్చాయి. ఈ 'వీఐపీ ట్రీట్మెంట్' వల్ల ప్రీమియం యూజర్లకు ఎప్పుడూ ఎలాంటి ఆటంకం లేకుండా హై-స్పీడ్ స్ట్రీమింగ్ లభిస్తుంది. అయితే, రద్దీగా ఉండే మాల్స్ లేదా సిటీ సెంటర్లలో ప్రీపెయిడ్ యూజర్లకు నెట్ కొంచెం నెమ్మదించే అవకాశం ఉంది. బడ్జెట్ గురించి ఆలోచించే స్టూడెంట్స్ మాత్రం ఇప్పటికీ ప్రీపెయిడ్ ప్లాన్లనే ఇష్టపడుతున్నారు. ఇక ఫ్యామిలీ పోస్ట్పెయిడ్ ప్లాన్లు తీసుకుంటే ఒక్కొక్కరికి పడే ఖర్చు తగ్గుతుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.