ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ : హన్సిక, నేహాకు కాంస్య పతకాలు : ఫైనల్కు చేరిన మీనాక్షి గోయత్
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇండియా రెజ్లర్లు హన్సిక లంబా, నేహా కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. గురువారం జరిగిన మహిళల 55 కేజీల ప్లే ఆఫ్స్ బౌట్లో హన్సిక 6-1తో అరుకి కడియార్బెక్ (కిర్గిస్తాన్)పై గెలిచింది. రెండో రౌండ్లో లెగ్ ఎటాక్ ద్వారా పాయింట్లు నెగ్గి బౌట్లో పైచేయి సాధించింది. 59 కేజీల బ్రాంజ్ బౌట్లో నేహా 10-4తో బోలోరుతుయా కురెలెక్ (మంగోలియా)పై నెగ్గింది. 53 కేజీల సెమీస్లో మీనాక్షి గోయత్ 4-2తో పార్క్ సెయెంగ్ (సౌత్ కొరియా)పై గెలిచి ఫైనల్కు చేరింది. చివరి 30 సెకన్ల వరకు 0-2తో వెనకబడిన మీనాక్షి తర్వాత పుంజుకుంది. బలమైన అటాకింగ్తో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గింది.