బ్రెజిల్లో డ్రగ్ ముఠాలపై జరిపిన దాడుల్లో 64 మంది మృతి
బ్రెజిల్లోని రియో డి జెనీరోలో డ్రగ్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్న ముఠాలపై పోలీసులు భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. అక్టోబర్ 29న జరిగిన ఈ ఆపరేషన్లో సుమారు 2500 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఈ దాడుల్లో 64 మంది అనుమానితులు మరణించగా, నలుగురు పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్గా గవర్నర్ క్లాడియో కాస్ట్రో తెలిపారు. సాయుధ వాహనాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగించి ఈ ఆపరేషన్ నిర్వహించారు.