12 జిల్లాల్లో రేపే రేషన్ పంపిణీ : మంత్రి నాదెండ్ల మనోహర్
తుఫాన్ నేపథ్యంలో 12 జిల్లాలలో రేపే రేషన్ పంపిణీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతీ నెలా 1వ తేదీ ఇచ్చే రేషన్ రేపు ఉదయం నుండే ఇస్తామన్నారు. 14 వేల 145 షాపులు ద్వారా 7 లక్షల మందికి రేషన్ పంపీణీ చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల రేషన్ షాపులకు సరుకులు ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. రైతుల ధాన్యం తడవకుండా 30 వేల టార్పాలిన్లు సివిల్ సప్లై ద్వారా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.