దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాడిశెట్టి రాజా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. 2019లో తుని రూరల్ లో ఓ దినపత్రిక విలేకర్ కె. సత్యనారాయణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసుకు సంబంధించి అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు పోలీసులు తిరిగి ఓపెన్ చేశారు. దీంతో ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.