11 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ , శాసనమండలి సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ , శాసనమండలి సమావేశాల నిర్వహణ తేదీ ఖరారైంది. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.