లోకో పైలట్ హత్య కేసులో నిందితుడు అరెస్టు !
విజయవాడలో లోకో పైలట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బిహార్కు చెందిన దేవ్ కుమార్గా గుర్తించి అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న దేవ్కుమార్ను లోకో పైలట్ ప్రశ్నించాడని, దీంతో ఇనుపరాడ్తో లోకో పైలట్పై నిందితుడు దాడి చేశాడని రైల్వే ఏసీసీ రత్న వెల్లడించారు. మచిలీపట్నం వద్ద నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు.