సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్టు
ప్రీ లాంచ్ పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల కిందట ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా ఫ్లాట్లను విక్రయించింది. అమీన్పూర్తోపాటు మిగతా ప్రాంతాల్లో సాహితీ శర్వాణీ ఎలైట్ పేరుతో ఎండీ లక్ష్మీనారాయణ శ్రీకారం చుట్టాడు. రేటు తక్కువ పెట్టి, అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు చెప్పగానే వేలాది మంది కొనుగోలుదారులు ఆకర్షితులయ్యారు. దీంతో కస్టమర్ల నుంచి వేల కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఏళ్లు గడుస్తున్నా, పనులు ప్రారంభంకాలేదు. దాదాపు రూ. 3 వేల కోట్లు వసూలు చేసి, చివరకు బోర్డు తిప్పేసింది.