నోట్ల రద్దప్పుడు తాళాలు పడ్డ ఫ్యాక్టరీల గురించి ఎందుకు మోడీ మాట్లాడరు ?
కాంగ్రెస్ గెలిస్తే అయోధ్య రామ మందిరానికి తాళం వేస్తోందన్న మోడీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నోట్ల రద్దు సమయంలో తాళాలు పడ్డ ఫ్యాక్టరీల గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తుచేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో యూపీకి చెందిన వారు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని చాలా మంది చనిపోయారని కానీ ఆయన వాటి గురించి మాట్లాడరని ఎద్దేవా చేశారు.