శాంసంగ్ నుంచి కొత్త ప్రీమియం గాడ్జెట్లు ?
స్మార్ట్ వాచ్ సిరీస్ ను విస్తరించాలనుకుంటున్నట్లు శాంసంగ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగా స్మార్ట్ వాచ్ల యొక్క కొత్త ప్రీమియం మోడళ్లను పరిచయం చేయవచ్చని పెద్ద టీజర్ వదిలింది. కంపెనీ తన క్యూ1 ఆదాయాలను మంగళవారం ప్రకటించింది. నిర్వహణ లాభాలు దాదాపు రూ. 37 వేల కోట్లుగా నివేదించింది. MX బిజినెస్ పోస్ట్ చేసిన అధిక ఆదాయాలు కూడా పెరిగిన లాభాలకు కారణమని పేర్కొంది.అలాగే, రాబోయే త్రైమాసికం మరియు మిగిలిన సంవత్సరంలో దాని ప్రణాళికలను కూడా పంచుకుంది. మొబైల్ ఎక్స్పీరియన్స్ వ్యాపారం కోసం ఈ సంవత్సరం గెలాక్సీ వాచ్, గెలాక్సీ రింగ్ కొత్త మోడళ్లను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ రింగ్ ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ప్రదర్శించబడింది. అయితే అప్పుడు దాని లాంచ్ తేదీ గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే, ఈ గెలాక్సీ రింగ్ను ఈ సంవత్సరం చివర్ లో ప్రారంభించవచ్చని ప్రస్తావన హైలైట్ చేస్తుంది. ఇది సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారీ ఉత్పత్తిలోకి ప్రవేశించవచ్చని నివేదిక పేర్కొంది. కొత్త ప్రీమియం మోడల్లను పరిచయం చేయడం ద్వారా సంస్థ ఈ విభాగాన్ని విస్తరించాలని ఆలోచిస్తోంది. కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో గెలాక్సీ వాచ్ 6 మరియు గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ కలిగి ఉంది. అయితే, ఈ సంవత్సరం, ఇది వాటితో పాటు ఇతర మోడళ్లను కూడా పరిచయం చేస్తుంది. గత నివేదిక ప్రకారం, శాంసంగ్ కొత్త చదరపు లేదా దీర్ఘచతురస్రాకార స్మార్ట్వాచ్ను కూడా లాంచ్ చేయవచ్చు.