చందమామ ఫోటోలు తీసిన చంద్రయాన్ 3
చంద్రయాన్ 3 తీసిన జాబిల్లి ఫోటోలను ఇస్రో ఎక్స్( ట్విటర్) వేదికగా పంచుకుంది. ఆగస్ట్ 20న ట్విటర్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకున్న ఇస్రో నేడు తాజాగా తీసిన మరిన్ని ఫోటోలను షేర్ చేసింది. ల్యాండర్ పొజిషన్ డిటెక్టర్ తీసిన ఫోటోలను ఇస్రో షేర్ చేసింది. ఆగస్టు 20న షేర్ చేసిన ఫోటోలను ఇమేజర్ కెమెరా 4 తో తీసింది చంద్రయాన్ 3. దీని బట్టి చూస్తుంటే చంద్రునిపై ల్యాండ్ అవడానికి అనుకూలమైన ప్రదేశాల కోసం విక్రమ్ ల్యాండర్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రునిపై ఉన్న బండరాళ్లు, గుంతల ఫోటోలను తీసింది విక్రమ్ ల్యాండర్. ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ఆగస్టు 23 సాయంత్రం 6.04గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లి పైకి చేరుకోవాలి. అయితే ఇది జాబిల్లి పైకి వెళ్లడానికి రెండు గంటల ముందు పరిస్థితులన్నీ చూసుకొని అప్పుడు అనుకూలంగా ఉంటేనే విక్రమ్ ను ల్యాండ్ చేస్తామని లేదండే ల్యాండింగ్ తేదీ మారవచ్చని ఇస్రో ప్రకటించింది. అయితే భారత్ కంటే ముందే చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకోవాలని ప్రయత్నించి రష్యా విఫలమైన సంగతి తెలిసిందే. రష్యా పంపిన లూనా 25 ల్యాండింగ్ సమయంలో జాబిల్లికి తగిలి క్రాష్ అయినట్లు ఆ దేశ అంతరిక్ష సంస్థ ప్రకటించింది. ఇక చంద్రయాన్ 3 కనుక జాబిల్లి పై సేఫ్ గా ల్యాండ్ అయితే అంతరిక్ష పరిశోధనలో భారత్ ఎలైట్ లిస్ట్ లోకి చేరుతుంది.