16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగం నిషేధిస్తూ ఆస్ట్రేలియా : నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధాని మోడీ
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగం నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఒక గొప్ప ఉదాహరణగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ప్రపంచ దేశాలు పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల భద్రత, వారి మానసిక ఆరోగ్యం విషయంలో ఇటువంటి నిర్ణయాలు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు భారత్ కూడా డిజిటల్ భద్రతపై గట్టి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోందని స్పష్టం చేస్తున్నాయి. మేము మీ నుంచి పాఠాలు గ్రహిస్తున్నాం అని మోడీ చెప్పడం వెనుక లోతైన అర్థం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. పెరుగుతున్న సైబర్ ముప్పులు, పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించవచ్చు. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఆంక్షలు విధించడం ద్వారా వారిని చెడు అలవాట్లకు దూరంగా ఉంచడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం కావొచ్చు. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది..