15న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల 15న కేబినెట్ను సమూలంగా ప్రక్షాళన చేయనుంది. కేబినెట్లో చోటు దక్కేవారు అందుబాటులో ఉండాల్సిందిగా బీజేపీ ఎంపీలకు అధిస్టానం ముందస్తు సమాచారం ఇచ్చింది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అందులో చోటు కోసం ఆశావహుల ఎదురు చూపులు చూస్తున్నారు. ఇందులో మహిళలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రధాన్యత ఇవ్వనున్నారు. కొంత మంది కేంద్ర మంత్రులను తప్పించి.. వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. యథావిధిగా ఈ నెల 15న కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేబినెట్లో చోటు దక్కేవారిని ఆహ్వానించనున్నారు. ఈసారి పూర్తిస్థాయిలో కేంద్ర కేబినెట్ కొలువుదీరనుంది.