అరేబియా సముద్రంలో 450 కిలోమీటర్ల పరిధిని క్లోజ్ చేస్తూ 'నోటమ్' జారీ చేసిన పాకిస్తాన్ : రంగంలోకి 'ఐఎన్ఎస్ ధ్రువ్'


పాకిస్తాన్ చేపట్టిన క్షిపణి పరీక్షలను ఎదుర్కోవడానికి భారత్ తన అత్యంత శక్తివంతమైన నిఘా నౌక ఐఎన్ఎస్ ధ్రువ్‌ను రంగంలోకి దింపింది. వ్యూహాత్మక క్షిపణి పరీక్షల కోసం పాకిస్థాన్ ఏప్రిల్ 14-15 తేదీల్లో అరేబియా సముద్రంలోని దాదాపు 450 కిలోమీటర్ల పరిధిని క్లోజ్ చేస్తూ 'నోటమ్' జారీ చేసింది. కరాచీ, గ్వదర్ తీరాలకు సమీపంలో ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా సముద్ర మార్గంలో తన పట్టును నిరూపించుకోవాలని పాకిస్తాన్ భావించింది. పాక్ క్షిపణి పరీక్షల ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే భారత్ స్పందించింది. అత్యాధునిక నిఘా యుద్ధనౌక ఐఎన్ఎస్ ధ్రువ్‌ను అరేబియా సముద్రంలోకి పంపడం ద్వారా పాక్ రక్షణ శాఖను ఆశ్చర్యపరిచింది. పాక్ క్షిపణుల పనితీరును, వాటి రహస్య సాంకేతికతను పసిగట్టడమే లక్ష్యంగా భారత్ ఈ అడుగు వేసింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org