మైత్రీ వనంలో అగ్ని ప్రమాదం : నీలగిరి బ్లాక్లో చిక్కుకున్న విద్యార్థులు
హైదరాబాద్, అమీర్ పేట, మైత్రీ వనంలోని నీలగిరి బ్లాక్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కొందరు విద్యార్థులు నీలగిరి బ్లాక్లో చిక్కుకున్నారు. అక్కడి ఓ ఇన్స్టిట్యూట్లో వారు ఉన్నారు. వారిని సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు దట్టమైన పొగలు అలుముకున్నాయి. అమీర్ పేట అంటేనే ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా రకరకాల కోచింగ్ సెంటర్లకు అది ఫేమస్. అక్కడ లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అలాంటి చోట ఈ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. ఐతే.. మంటలు మరింత పెరగకుండా.. కంట్రోల్ చేస్తున్నారు. పొగ వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోంది. ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థులను త్వరగా రక్షించడం కష్టమవుతోంది. అయినా ప్రయత్నిస్తున్నారు.