దేశంలో ప్రతిరోజూ సగటున 493 మిలియన్ల యూపీఐ లావాదేవీలు !
దేశంలో ప్రతిరోజు సగటున 493 మిలియన్ల యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలు జరిగినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని హైలైట్ చేస్తూ కొన్ని సంఖ్యలను వెల్లడించాడు. వైష్ణవ్ పోస్ట్ ప్రకారం, భారత్లో ఇప్పుడు ప్రతిరోజు సగటున 493 మిలియన్ల యూపీఐ లావాదేవీలను జరుగుతున్నాయి. ఈ లావాదేవీల వార్షిక విలువ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని, డిజిటల్ లావాదేవీలపై దేశం పెరుగుతున్న దృష్టిని ప్రదర్శిస్తుందని ఆయన పేర్కొన్నారు.