వైసీపీకి గంటా ప్రసాదరావు రాజీనామా !
ఏలూరు జిల్లాలో సీనియర్ నేత అయిన గంటా ప్రసాదరావు వైసీపీని విడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ వైసీపీ సభ్యత్వానికి, జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసి ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్కు పంపించారు. ఆయన భార్య గంటా పద్మశ్రీ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె కూడా వైసీపీకి గుడ్ బై చెబుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. భార్యభర్తలు టీడీపీ, జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.