విలేకరిని స్థంభానికి కట్టేసి కొట్టిన జనం !

------------------

విలేకరి ముసుగేసుకుని అడ్డమైన పనులు చేస్తున్నవారు పెరిగిపోయారు. రిపోర్టర్‌ అంటూ బ్లాక్‌మెయిల్‌ చేసేవారి అరాచకాలు ఎక్కువయ్యాయి. ప్రజల సహనానికి కూడా హద్దు ఉంటుంది. ఓ విలేకరి చేస్తున్న అరాచకాలను సహించలేకపోయారు. ప్రజలు తిరగబడ్డారు. తప్పుడు రాతలతో ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉన్న పటాన్‌చెరువు రిపోర్టర్‌ను స్థంభానికి కట్టేసి, ప్రజాకోర్టులో శిక్షించారు. ఊర్లో అన్ని ఇళ్లను కూల్చివేయిస్తా అంటూ ఫొటోలు తీయడంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. ఒక్కో ఇంటికి పాతిక వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. గతంలోనే సంతోష్ అనే ఈ విలేకరి వేధింపులు భరించలేక రెండు ప్లాట్లు గ్రామస్తులు ఇచ్చారు. అయినప్పటికీ ఇతడి ధనదాహం తీరలేదు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org