చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం !
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, మొగలి ఘాట్ వద్ద బస్సు, లారీలు ఢీకొన్నఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవ్వగా, మరో 30 మంది గాయపడ్డారు. ముందుగా ఒక లారీని ఢీకొన్న బస్సు ఆ వెంటనే మరో లారీ ని ఢీకొట్టింది. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు. మరణాలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు ప్రకటించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు.