భారీ ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టుల మృతి !
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దంతెవాడ, నారాయణపూర్, బస్తర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. పలు ఆటోమేటిక్ ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్, బస్తర్ ఎస్పీ శలభ్ కుమార్ సిన్హా దృవీకరించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇవాళ పోలీసులతో కలిసి కూంబింగ్ చేపట్టిన సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఆపరేషన్ కొనసాగుతోంది. కొన్ని నెలల క్రితం కూడా ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.