9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం !
కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో విఫలమైందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ లు పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పాలనలో పేదలు పేదలుగానే ఉన్నారని, బీజేపీ అధికారం చేపట్టిన 9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని రాజ్నాథ్ పేర్కొన్నారు.