వందలాది మంది ఉద్యోగులకు మంగళం పాడుతున్న బైజూస్ !
ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వందలాది మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కసరత్తు చివరి దశలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. నివేదికల ప్రకారం, నోటీసు వ్యవధిని అందించకుండానే కంపెనీ కార్మికులను వెళ్లగొడుతోంది. దీంతో పాటుగా బైజూ తన వేల మంది ఉద్యోగులకు వరుసగా రెండవ నెల జీతాలను ఆలస్యం చేసింది.ఉద్యోగులకు పంపిన ఇమెయిల్లో, కంపెనీ యాజమాన్యం ఓ ప్రకటనలో వేతనాల పంపిణీలో మళ్లీ జాప్యం జరుగుతుందని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నామని తెలిపింది.