సోలార్ ఛార్జ్ సైకిల్ !


రాజస్తాన్ లోని ఉదయపూర్‌లో మహారాణా ప్రతాప్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీకి చెందిన ఎలక్ట్రికల్ విభాగం ఈ-సైకిల్‌ను ఆవిష్కరించింది. ఇ-సైకిల్ ఇద్దరు వ్యక్తుల బరువును అంటే 160 కిలోల బరువును తట్టుకోగలదు. ఈ-సైకిల్ కూడా సోలార్ ద్వారా ఛార్జ్ చేయబడి నడుస్తుంది. దేశంలో ఇ-వాహనాల విప్లవం వచ్చిందని ఎలక్ట్రికల్ విభాగం అధిపతి విక్రమాదిత్య దవే ​​అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించిన తర్వాత ప్రజలు కూడా ఈ-వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ-సైకిల్ ఆవిష్కరించబడింది. ఉదయం మీరు సైక్లింగ్ కోసం ఉపయోగించవచ్చు. అంతే కాకుండా.. మార్కెట్, ఆఫీసుకి వెళ్లడానికి ఈ బైక్ ఉపయోగించవచ్చు. ఈ-సైకిల్‌లో బ్యాటరీ, ఎల్‌ఈడీ సిస్టమ్‌, సోలార్‌ ప్యానెల్‌, మోటార్‌, లైట్‌, హారన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే 3 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది అంటే రూ.30 చార్జీ అవుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. మీరు ఈ-సైకిల్ ద్వారా 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే.. ఇది సోలార్ నుండి ఛార్జింగ్ చేస్తే 5 కిలోమీటర్లు అదనంగా నడుస్తుంది. అవసరాన్ని బట్టి బ్యాటరీని పెంచుకోవచ్చు. ఈ-సైకిల్ చదునైన రహదారిపై 160 కిలోల బరువును మోయగలదు. వాలుపై 80 కిలోల బరువును మోయగలదు. ఈ-సైకిల్ ధర సామాన్యులకు సులువుగా ఉంటుందని ఆయన అన్నారు. కొత్త సైకిల్‌ తయారు చేయడానికి 30-35 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. పాత సైకిల్‌ను ఈ సైకిల్ గా మార్చాలంటే.. దీనికి రూ. 18వేలు ఖర్చు అవుతుంది. దీని ద్వారా కూడా ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 40 కిలో మీటర్ల వరకు వెళ్లవచ్చు. సోలార్ ద్వారా కూడా దీనికి ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org