హైదరాబాద్ లోని నార్సింగి కారు బీభత్సం కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు నడిపిన యువకుడితో పాటు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. డ్రైవర్కు అల్కాహాల్ టెస్టులో పర్సంటేజ్ 100 BACగా వచ్చిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలోనూ కారు అతివేగంగా రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టడం స్పష్టంగా కనిపించింది. రాంగ్ రూట్లో అతి వేగంగా వచ్చిన కారు రిటైర్డ్ ఆర్మీ జవాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో లో రిటైర్డ్ ఆర్మీ జవాన్ రవీందర్ మృతి చెందారు. ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఐదుగురు యువకులున్నట్లు పోలీసులు గుర్తించారు. బోనాల పండగకు మద్యం తాగి వాహనం నడుపుతూ వచ్చి ఈ ప్రమాదానికి కారణమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నార్సింగి కారు బీభత్సం కేసులో ఐదుగురు అరెస్ట్
الثلاثاء، 11 أغسطس 2026
crime Five Arrested in Narsingi Car Crash Case hyderabad lost his life after being struck by the speeding car Ravinder retired Army soldier telangana
ليست هناك تعليقات:
إرسال تعليق