చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి చాంగ్కింగ్ మునిసిపాలిటీ పరిధిలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది ఆచూకీ లభ్యం కాకుండా పోయినట్లు స్థానిక అధికార యంత్రాంగం వెల్లడించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 10 మందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. వుజియాంగ్ నదీ తీర ప్రాంతంలోని పెంగ్షుయ్ కౌంటీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండపై నుంచి పెద్ద ఎత్తున మట్టి, బండరాళ్లు జారిపడటంతో సమీపంలో ఉన్న 10కి పైగా నివాస భవనాలు పూర్తిగా ధ్వంసమై మట్టి దిబ్బల కింద కూరుకుపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లలోనే ఉన్న స్థానికులు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విపత్తు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ 'లెవెల్-II' జాతీయ అత్యవసర ప్రతిస్పందనను అమలు చేసింది. విపత్తు నివారణ కమిషన్ సైతం సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఉన్నత స్థాయి బృందాన్ని ఘటనా స్థలానికి పంపింది. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ప్రమాద ప్రాంతం నుండి దాదాపు 1,100 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విషాదంపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తుల వల్ల ప్రాణనష్టం జరగకుండా ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
చైనాలో వర్షాల ధాటికి విరిగిపడిన కొండచరియలు : 8 మంది మృతి, 34 మంది గల్లంతు
السبت، 18 يوليو 2026
34 Missing 8 dead international Landslides Triggered by Heavy Rains in China Rescue teams successfully retrieved 10 people trapped under the debris
ليست هناك تعليقات:
إرسال تعليق