ఢిల్లీలో మద్యం వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా చేరిన వ్యక్తి తన అనుచరులతో కలిసి దోపిడీకి పాల్పడ్డాడు. వ్యాపారి కుటుంబ సభ్యులను వారు నిర్బంధించి రూ.25 లక్షల విలువైన నగలను దోచుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆరుగురు వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. వృద్ధ జంటను, వారి కోడలు, పిల్లలను ఒక గదిలో నిర్బంధించి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యాపారి ఇంటికి చేరుకున్నారు. పనిమనిషి సుశీల్ పక్కా ప్లాన్, రెక్కీ నిర్వహించిన తర్వాత తన వారితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడ్ని నియమించిన సంస్థ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. కాల్ డాటా వంటి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, హర్యానాతో సహా పలు రాష్ట్రాల్లో నిందితుల కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మద్యం వ్యాపారి కుటుంబాన్ని నిర్బంధించి రూ.25 లక్షల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు !
السبت، 18 أبريل 2026
crime currently gathering details regarding him from the agency that facilitated his recruitment delhi Miscreants Confine Liquor Merchant's Family and Loot Ornaments Worth ₹25 Lakhs
ليست هناك تعليقات:
إرسال تعليق