డాక్టర్ షహీన్‌ నా భార్య : ముజమ్మిల్ షకీల్

الخميس، 27 نوفمبر 2025

car bomb blast conspiracy case in Delhi Dr. Shaheen My wife It is reported that he said that he married her in Al Falah Masjid and also showed the full proof of that Muzammil Shakeel national

t f B! P L


ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు కుట్ర కేసులో అరెస్టయిన సహ నిందితుడు ముజమ్మిల్ షకీల్ తనతో పాటు అరెస్టయిన డాక్టర్ షహీన్ షాహిద్ తన ప్రియురాలు మాత్రమే కాదని, ఆమె తన భార్య అని విచారణ సంస్థలకు తెలిపినట్లు తెలుస్తోంది. అతడు ఆమెను అల్ ఫలా మసీదులో పెళ్లాడినట్లు చెప్పి, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా చూపించాడని సమాచారం. ముజమ్మిల్ షకీల్ విచారణ సంస్థలకు ఇచ్చిన వాంగ్మూలంలో డాక్టర్ షహీన్‌తో తన వివాహం 2023 సెప్టెంబర్‌లో జరిగిందని తెలిపాడు. అల్‌ ఫలా యూనివర్సిటీ సమీపంలోని ఒక మసీదులో షరియా చట్టం ప్రకారం.. ఆమెను పెళ్లాడినట్లు వివరించాడు. ఆ సందర్భంగానే షరియా ప్రకారం రూ. 5,000 నుంచి 6,000 'మెహర్'  ఇవ్వడానికి అంగీకరించినట్లు పేర్కొన్నాడు. అయితే ఈ విషయం షహీన్ మాజీ భర్త డాక్టర్ హయత్ జాఫర్‌కు, ఆమె పిల్లలకు కూడా తెలియదు. ముఖ్యంగా డాక్టర్ షహీన్ అరెస్ట్ అయిన రెండు రోజులకే ఆయన మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తన భార్య అసలు బురఖా కూడా ధరించేదని కాదని, యూరప్‌లో స్థిరపడాలని కలలు కన్న ఆమె ఇలా చేసిందంటే తాను అస్సలే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇదే విషయంలో తనతో గొడవ పడి మరీ విడాకులు తీసుకుందని అన్నారు. ఢిల్లీ కారు పేలుడు కుట్ర కోసం ముజమ్మిల్‌కు డాక్టర్ షహీన్ భారీగా ఆర్థిక సహాయం అందించినట్లు దర్యాప్తులో వెల్లడి అయింది. 2023లో ఆయుధాలు కొనుగోలు చేయడానికి ముజమ్మిల్‌కు దాదాపు రూ. 6.5 లక్షలు అందించింది. 2024లో బాంబర్ ఉమర్ ఉన్ నబీ కారు (ఫోర్డ్ ఎకోస్పోర్ట్) కొనుగోలు చేయడానికి రూ. 3 లక్షలు అప్పుగా ఇచ్చింది. మొత్తంగా ఆయుధాలు, పేలుడు పదార్థాల సేకరణ కోసం షహీన్ ఈ జైష్ మాడ్యూల్‌కు దాదాపు రూ. 27 నుంచి 28 లక్షల వరకు నిధులు అందించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అయితే ఈ నిధులను ముజమ్మిల్‌కు మతపరమైన దానంగా మాత్రమే ఇచ్చానని షహీన్ విచారణ అధికారులకు తెలిపింది. ఈ కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఏడో అరెస్ట్‌ కూడా చేసింది. నవంబర్ 10వ తేదీన జరిగిన దాడికి కొద్ది క్షణాల ముందు బాంబర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించి, లాజిస్టికల్ సహాయం అందించిన ఆరోపణలపై ఫరీదాబాద్‌లోని దౌజ్ ప్రాంతానికి చెందిన షోయాబ్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా దక్షిణాది కాశ్మీర్‌లోని కొన్ని ఉగ్రవాద మాడ్యూళ్లపై కూడా అధికారులు దృష్టి సారించారు. 2016 నుంచి బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్, గందర్‌బాల్ ప్రాంతాల్లో చురుకుగా ఉన్న ఈ మాడ్యూళ్లు.. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అనుమానిస్తున్నారు. ముజమ్మిల్, ఉమర్‌లకు అసాల్ట్ ఆయుధాలను వీరే విక్రయించి ఉంటారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ