సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ ఫైనల్లో 21-18, 21-11 తేడాతో బావో లి జింగ్, లీ కియాన్ (చైనా) ద్వయంపై వరుస గేమ్ల విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో టైటిల్ను గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించింది. ఈ జోడీ 2022లో రన్నరప్గా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్లో మాత్రం భారత్కు నిరాశే మిగిలింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అయిదో సీడ్ తనీషా- ధ్రువ్ 21-18, 14-21, 8-21తో డెచాపోల్, డెచాపోల్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో పృథ్వీ, ప్రతీక్ జోడీ పోరాడింది. 71 నిమిషాలపాటు సాగిన టైటిల్ పోరులో 14-21, 21-19, 17-21తో హువాంగ్ డి, లియు యాంగ్ (చైనా) ద్వయం భారత జోడీపై విజయం సాధించింది.
మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీకి టైటిల్ !
الأحد، 1 ديسمبر 2024
national sports టైటిల్ను గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డు ట్రీసా జాలీ జోడీకి టైటిల్ మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300
ليست هناك تعليقات:
إرسال تعليق