కెన్యా పార్లమెంట్ పరిసరాలు ప్రజల ఆందోళనలు, నిరసనలతో అట్టుడికింది. పార్లమెంట్లో కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టి మంగళవారం ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. వీరిని నిలువరించేందుకు భద్రతా బలగాలు భాష్పవాయువు, నీటి ఫిరంగులు ఉపయోగించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కొంత భాగం మంటల్లో కాలిపోయింది. పరిస్థితులు చేదాటిపోవడంతో పోలీసులు గుంపులను చెదరగొట్టడానికి ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ఇక నిరసనకారులు కూడా భద్రతా దళాలపై రాళ్ళు విసిరారు. ఇలా ఉద్రిక్త పరిస్థితుల్లో పలువురికి గాయాలయ్యాయి. అలాగే భద్రతా దళాలు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పన్నులను పెంచే ఆర్థిక బిల్లుకు కెన్యా పార్లమెంట్ మంగళవారమే ఆమోదం తెలిపింది.
కెన్యాలో కొత్త పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు !
Telugu Lo Computer
0
Comments
Post a Comment