ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్కు అధికారులు సమయానికి హాజరుకాకపోవడంతో బాధితులు గంటల తరబడి పడిగాపులు కాశారు. ఉదయం 11 గంటలు దాటినా సంబంధిత అధికారులు రాకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన నిర్వాసితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భూములు, ఇళ్లు కోల్పోయి ఏళ్లుగా పరిహారం, పునరావాసం కోసం ఎదురుచూస్తున్న తమ సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.
గ్రీవెన్స్ అధికారుల కోసం పడిగాపులు కాసిన వెలిగొండ నిర్వాసితులు
الأربعاء، 2 سبتمبر 2026
Andhra Pradesh take steps to ensure the smooth functioning of the special grievance cell Veligonda Project Evictees Wait Endlessly for Grievance Officials
ليست هناك تعليقات:
إرسال تعليق