తెలంగాణలోని సూర్యాపేట సమీపంలో గల పిల్లలమర్రి వద్ద హైదరాబాద్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి డాక్టర్ కాసకుర్తి జగదీశ్ అనే వ్యక్తి సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే కారు మొత్తం మంటలు వ్యాపించాయి. మరోవైపు కారులో ఉన్న వ్యక్తి బయటకు రాలేక, లోపలే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించారు. మృతుడు ఎవరనే వివరాలు వెల్లడించారు. ఖమ్మం మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్ గా జగదీశ్ సేవలు అందిస్తున్నారని గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై డివైడర్ ను ఢీకొని కారు దగ్ధం :కారు లోని డాక్టర్ కాసకుర్తి జగదీశ్ సజీవ దహనం
Sunday, September 20, 2026
Car Catches Fire After Crashing into Divider on Hyderabad-Khammam Highway close to Suryapet crime Doctor Burnt Alive near Pillalamarri telangana
No comments:
Post a Comment