కాంగ్రెస్ పార్టీ 'ఛాత్రోంకీ గూంజ్' పేరుతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో ప్రధాని మోడీని విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించిన 'ఛాత్రోంకీ గూంజ్' కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఓ కమెడియన్ ను తీసుకొచ్చి ప్రధాని మోడీ విదేశీ నేతలను కలిసినప్పుడు ప్రదర్శించే హావభావాలతో స్కిట్ చేయించారు. ఇది కాస్తా వివాదాస్పదమైంది. ఇండోర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని చూసేందుకు, మాట్లాడేందుకు భారీ ఎత్తున విద్యార్ధులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో స్టాండ్-అప్ కమెడియన్ పుల్కిత్ మణి రాహుల్ గాంధీతో కలిసి వేదికపైకి వచ్చి, ప్రధాని మోడీ ప్రసంగాన్ని, హావభావాలను, బహిరంగ వ్యక్తిత్వాన్ని అనుకరించారు. బీజేపీ ర్యాలీకి హాజరైన ఒక వృద్ధురాలి కోసం కుర్చీ ఏర్పాటు చేయమని ప్రధాని నిర్వాహకులను కోరిన సంఘటన నుండి ఈ స్కిట్లోని కొంత భాగం ప్రేరణ పొందినట్లు జనం ఆ తర్వాత గుర్తించారు.
మోడీపై రాహుల్ 'మై ఫ్రాండ్ ' స్కిట్ వైరల్ !
Sunday, September 20, 2026
congress Madya Presh national Rahul's 'My Friend' skit targeting Modi goes viral recent instance at an event in Indore
No comments:
Post a Comment