కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన ర్యాలీ : ఢిల్లీలో హై అలర్ట్ : ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత

الاثنين، 20 يوليو 2026

Central Secretariat Cockroach Janata Party Protest Rally Five Key Metro Stations Closed High Alert in Delhi Janpath national Patel Chowk Rajiv Chowk Seva Tirath

t f B! P L

పార్లమెంట్ వైపు నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు కాక్రోచ్‌ జనతా పార్టీ  ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సోమవారం ఐదు కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని డీఎంఆర్‌సీ వెల్లడించింది. డీఎంఆర్‌సీ మూసివేసిన స్టేషన్లలో రాజీవ్ చౌక్, జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ ఉన్నాయి. ఈ స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను పూర్తిగా నిలిపివేయగా, సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ప్రయాణించే వారు తాజా డీఎంఆర్‌సీ సమాచారం తెలుసుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కాక్రోచ్‌ జనతా పార్టీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున విద్యా రంగ సంస్కరణలను డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నిరసనకు తొలుత సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ పిలుపునిచ్చినప్పటికీ, ఆయన శనివారం ఆస్పత్రిలో చేరిన తర్వాత పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో పాటు ఇతర కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద కూడా పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి కోరలేదని, ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఢిల్లీ జిల్లాలో భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. గతంలో అమల్లో ఉన్న సీఆర్పీసీ సెక్షన్ 144కు సమానమైన ఈ నిబంధనల ప్రకారం నిరసన ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, ఐదుగురికి మించిన గుంపులుగా సమావేశాలు నిషేధించబడ్డాయి. జంతర్ మంతర్‌లో మాత్రమే ముందస్తు అనుమతితో నిరసనలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల భద్రత దృష్ట్యా ఈ ఆంక్షలు అవసరమని పేర్కొన్నారు. పార్లమెంట్ పరిసరాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంక్షలను ఉల్లంఘించి నిరసన ర్యాలీలు లేదా నిషేధిత ప్రాంతాల్లో గుమికూడే వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223తో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ఇక, మెట్రో స్టేషన్ల మూసివేతతో పాటు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉండే అవకాశం ఉన్నందున, సెంట్రల్ ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి, డీఎంఆర్‌సీ మరియు ట్రాఫిక్ పోలీసుల తాజా సూచనలను అనుసరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ