తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు మరియు విద్యా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలు తమ ట్యూషన్ ఫీజుల వివరాలను స్పష్టంగా నోటీసు బోర్డులపై మరియు అధికారిక వెబ్సైట్లలో తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల నుంచి అదనపు రుసుములు వసూలు చేయకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, నిబంధనలకు కట్టుబడి ఉన్నారో లేదో సరిచూసేందుకు గత రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించిన వార్షిక పరిపాలనా నివేదికలతో పాటు ఆడిట్ చేసిన ఆర్థిక వివరాలనుఈ నెల 30వ తేదీ లోగా విద్యాశాఖ పోర్టల్లో అప్లోడ్ చేయాలని డెడ్లైన్ విధించింది. ఒకవేళ ఈ ఆదేశాలను ఉల్లంఘించినా లేదా నిర్ణీత గడువులోగా నివేదికలు సమర్పించకపోయినా సంబంధిత పాఠశాలల గుర్తింపును రద్దు చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని విద్యాశాఖ అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.
తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ
الاثنين، 20 يوليو 2026
display details of their tuition fees on notice boards Education Department Issues Orders to Curb Fee Exploitation by Private Schools official websites telangana
ليست هناك تعليقات:
إرسال تعليق