బండ్ల గణేశ్ ఆస్తులను బ్యాంకు వేలం వేసి విక్రయించడాన్ని సమర్ధించిన తెలంగాణ హైకోర్టు : సుప్రీంకోర్టుకు వెళ్తానన్న గణేష్‌

السبت، 4 يوليو 2026

Andhra Pradesh Ganesh Vows to Approach Supreme Court He posted about this on the platform 'X' telangana Telangana High Court Upholds Auction of Bandla Ganesh's Assets by Bank

t f B! P L

సినీనటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఆస్తులను యూనియన్ బ్యాంకు వేలం వేసి విక్రయించడాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. ఈ తీర్పుపై బండ్ల గణేశ్ స్పందిస్తూ తన ఆస్తిని బ్యాంక్ వాళ్లు అన్యాయంగా విక్రయించారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అన్యాయంగా, లోపాయికారీ ఒప్పందంతో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు బ్యాంకు అధికారులు తన ఆస్తిని విక్రయించారని ఆరోపించారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2022లో న్యాయస్థానాలను ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. ఈ కేసులో డీఆర్టీలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చింది అని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా తెలంగాణ హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వెల్లడైందని అన్నారు.తెలంగాణ హైకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వెల్లడైనప్పటికీ భారత న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది అని బండ్ల గణేశ్ అన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి...నిజాయితీగా నా హక్కుల ఆధారంగా న్యాయం సాధిస్తాననే అచంచలమయైన నమ్మకం తనకు ఉంది అని నిర్మాత బండ్ల గణేశ్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా ఉన్న 'శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్'సంస్థ కోసం యూనియన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. ఈ రుణాలకు పూచీకత్తుగా జూబ్లీహిల్స్‌లోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని తాకట్టుగా పెట్టారు. ఈ రుణాలకు సంబంధించి కుటుంబ సభ్యులు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నారు. అయితే తీసుకున్న లోన్ సకాలంలో చెల్లించకపోవడంతో సర్ఫేసీ చట్టం కింద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019లో ఆస్తిని స్వాధీనం చేసుకుంది. 2022లో ఆస్తిని వేలం వేసింది.ఈ వేలంలో సదరు ఆస్తి రూ.8.51కోట్లకు విక్రయించబడింది.అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనకు అన్యాయం చేసింది అని బండ్ల గణేశ్ ఆరోపించారు. మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకే తన ఆస్తిని విక్రయించారని ఆరోపించారు. ఈ మేరకు రుణ వసూళ్ల ట్రైబ్యునల్(డీఆర్‌టీ)ని ఆశ్రయించగా సానుకూలంగా తీర్పు వెల్లడైంది. డీఆర్‌టీ వేలం ప్రక్రియను రద్దు చేసింది. అంతేకాదు వేలం ద్వారా వచ్చిన సొమ్మును ఆస్తి యజమానులకు చెల్లించాలని డీఆర్‌టీ ఉత్తర్వుల్లో పేర్కొంది. డీఆర్‌టీ ఉత్తర్వులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ మౌషూమి భట్టాచార్య, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బ్యాంకు వాదనలతో ఏకీభవించింది. డీఆర్‌టీ ఉత్తర్వులను రద్దు చేస్తూ బ్యాంకు చేపట్టిన వేలం ప్రక్రియ చెల్లుబాటు అవుతుందని తీర్పు వెల్లడించింది. హైకోర్టు తాజా తీర్పుతో బ్యాంకుకు రికవరీ ప్రక్రియలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు అయ్యింది. అయితే బండ్ల గణేశ్ మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ వ్యవహారం మళ్లీ ఏ మలుపుకు తిప్పుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ