ఢిల్లీ నుంచి ఛత్తీస్గడ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఛత్తీస్గడ్లోని రాయ్పూర్విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భయాంలోళనలు నెలకొన్నాయి. రాయ్పూర్ విమానాశ్రయ అథారిటీ ప్రకారం, విమానం ల్యాండింగ్ అవుతున్నప్పుడు అకస్మాత్తుగా పక్షి ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రయాణీకులకు గానీ, సిబ్బందికి గానీ ఎటువంటి గాయాలు కాకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే, పరిస్థితిని అంచనా వేయడానికి, ఇతర భద్రతా ప్రమాణాలనునిర్ధారించడానికి ఎయిరిండియా నిర్దేశిత చర్యలు చేపట్టింది.విమానయాన భద్రతా నియమాలకు అనుగుణంగా అవసరమైన తనిఖీలు చేపట్టినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తైన అనంతరం విమానానికి అనుమతి లభించిందని విమానాశ్రయ అథారిటీ ధృవీకరించింది. పక్షులు ఢీకొట్టడం అనేది విమానయానాల్లో పెద్ద ప్రమాదం. ఇటువంటి సంఘటనల తర్వాత, విమానం తిరిగి సేవలను ప్రారంభించే ముందు గాలిలో ప్రయాణించడానికి యోగ్యంగా ఉందని నిర్ధారించుకొనేందుకుగాను విమానయాన సంస్థలు వివరణాత్మక తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి : తృటిలో తప్పిన ప్రమాదం
الأربعاء، 17 يونيو 2026
Bird Hits Air India Flight ircraft landed safely without any injuries to passengers or crew landing at Raipur Airport in Chhattisgarh Narrow Escape from Accident national
ليست هناك تعليقات:
إرسال تعليق