ఉత్తర కొరియా దేశ పార్లమెంట్లో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రసంగిస్తూ అమెరికాను ఓ ఉగ్రవాద రాజ్యంగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతికి విఘాతం కలిగిస్తున్నది అమెరికా సైనిక విధానాలేనని ఆయన మండిపడ్డారు. ఉత్తర కొరియా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని స్పష్టం చేశారు. అణు సామర్థ్యం అనేది దేశ భద్రతకు అత్యవసరమని పేర్కొన్నారు. నేరుగా ఇరాన్ పేరు ఎత్తనప్పటికీ, పశ్చిమాసియాలో అమెరికా సాగిస్తున్న దాడులను కిమ్ తప్పుబట్టారు. శత్రువుల దాడులను తిప్పికొట్టేందుకు తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని హెచ్చరించారు. అదేసమయంలో పొరుగు దేశం దక్షిణ కొరియాను తమ దేశానికి ఉన్న అతిపెద్ద శత్రువుగా కిమ్ అభివర్ణించారు. సియోల్ గనుక తమ సరిహద్దులను ఉల్లంఘిస్తే నిర్దాక్షిణ్యంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను కలవాలనుకుంటున్నారనే వార్తలపై కిమ్ కిమ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. గత అనుభవాల దృష్ట్యా అమెరికా చర్చలక కంటే ఆయుధాల బలోపేతంపైనే తాము దృష్టి పెడతామని ఆయన స్పష్టమైన సంకేతాలను పంపించారు.
అమెరికా ఓ ఉగ్రవాద రాజ్యం : దేశ పార్లమెంట్లో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్
الأربعاء، 25 مارس 2026
America is a Terrorist State He made it clear that North Korea would never abandon its nuclear arsenal international President Kim Jong Un Addresses Parliament
ليست هناك تعليقات:
إرسال تعليق