తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల మధ్య ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. ఔటర్ రింగ్ రోడ్డులోని కృష్ణతేజ అతిథి భవనం సమీపంలో ఉన్న క్యూలైన్ లో ఇద్దరు భక్తులు తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఓ భక్తుడు తన బెల్ట్ తీసి మరో భక్తుడిపై దాడి చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన టీటీడీ భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనపై టీటీడీ విచారం వ్యక్తం చేసింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఓర్పు, సహనంతో ఉండాలని.. తోటి భక్తులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ క్యూలైన్ నియమాలను పాటించాలని టీటీడీ అధికారులు సూచించారు.
తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ : విచారం వ్యక్తం చేసిన టీటీడీ
الثلاثاء، 3 مارس 2026
Andhra Pradesh Devotees clash in Tirumala queue TTD expresses regret TTD security personnel and Srivari sevaks who immediately entered the field controlled them
ليست هناك تعليقات:
إرسال تعليق