తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేటకు చెందిన 31 ఏళ్ల ఓ వ్యక్తి కరీంనగర్ లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు. ఆయనకు మంచిర్యాలకు చెందిన మహిళ (29)తో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ప్లాటు ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారడంతో సామాజిక మాధ్యమాల ద్వారా మగవాళ్లను ఆకర్షించేలా భార్యాభర్తలుపోస్టులు పెట్టడం ప్రారంభించారు. కొందరు వ్యాపారులు, యువకులు వారి వలలో పడ్డారు. ఆమె వారిని తన అపార్ట్ మెంట్ కు పిలిచేది. వారితో సన్నిహితంగా ఉండగా భర్త రహస్యంగా వీడియోలు తీసేవాడు. ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి వీడియోలు అందరికీ చూపిస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్నారు. ఇలా మూడేళ్లలో సుమారు వంద మందికి పైగా పురుషులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. కరీంనగర్ కు చెందిన ఓ లారీ వ్యాపారిని సైతం బ్లాక్ మెయిల్ చేసి రూ.13 లక్షలు దండుకొని మరో సారి రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాపారంలో నష్టం : పురుషులకు వల వేసి సామాజిక మాధ్యమాల ద్వారా బ్లాక్ మెయిల్
الخميس، 15 يناير 2026
Blackmailing men through social media Business losses crime posting posts to attract men through social media telangana
ليست هناك تعليقات:
إرسال تعليق