తొ­లి­సా­రి­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­నిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

الاثنين، 26 يناير 2026

Chandrababu Naidu Governor Justice Abdul Nazeer unfurled the national flag Pawan Kalyan Republic Day celebrations held for the first time in Andhra Pradesh's capital Speaker Ayyanapatrudu

t f B! P L


మరావతిలోని హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో  తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేశ్‌, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా పరేడ్‌లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సవా­ళ్ల­ను ఎదు­ర్కొం­టూ ప్ర­భు­త్వం ధృ­ఢ­మైన సం­క­ల్పం­తో స్థి­ర­త్వా­న్ని పు­న­రు­ద్ధ­రిం­చ­డా­ని­కి, వి­శ్వా­సా­న్ని తి­రి­గి ని­ర్మిం­చ­డా­ని­కి కృషి చే­స్తోం­ద­ని గవ­ర్న­ర్ అబ్దు­ల్ నజీ­ర్ అన్నా­రు. నేటి వే­డుక చరి­త్రా­త్మ­క­మ­న్న ఆయన తొ­లి­సా­రి­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­జల రా­జ­ధా­ని అమ­రా­వ­తి­లో జా­తీ­య­జెం­డా ఎగు­ర­వే­స్తు­న్నా­మ­న్నా­రు. గత కొ­న్ని సం­వ­త్స­రా­లు­గా మన రా­ష్ట్రం స్ప­ష్ట­మైన దిశ లే­కుం­డా ని­లి­చి­పో­యిం­ద­ని చె­ప్పా­రు. రా­జ­ధా­ని ని­ర్మా­ణం ఆగి­పో­వ­డం­తో ఆర్థిక వి­శ్వా­సం దె­బ్బ­తిం­ద­న్నా­రు. పా­ల­న­లో కొ­న­సా­గిం­పుల లేమి పె­ట్టు­బ­డి­దా­రుల నమ్మ­కా­న్ని తగ్గిం­చి ఆర్థిక స్థి­ర­త్వా­న్ని బల­హీ­న­ప­రి­చిం­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. రా­ష్ట్రా­న్ని బల­ప­రు­స్తూ దాని భవి­ష్య­త్తు­ను సమృ­ద్ధి­గా తీ­ర్చి­ది­ద్దు­తు­న్న ప్ర­తి ఒక్క­రి­తో ఈ శు­భ­క్ష­ణా­న్ని పం­చు­కో­వ­డం గర్వ­కా­ర­ణ­మ­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­జ­లే ప్ర­గ­తి­కి శి­ల్పు­లు అని వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఈ ప్ర­యా­ణం సు­ల­భం కా­ద­న్న గవ­ర్న­ర్‌, వీటి ఫలి­తా­లు ఇప్పు­డు స్ప­ష్టం­గా కని­పి­స్తు­న్నా­య­న్నా­రు. ప్రా­జె­క్టు­లు ముం­దు­కు సా­గు­తు­న్నా­య­ని, సం­స్థ­లు తి­రి­గి బల­ప­డు­తు­న్నా­య­ని, ప్ర­జల వి­శ్వా­సం మళ్లీ స్థా­పి­త­మ­వు­తోం­ద­ని చె­ప్పా­రు. పు­న­రు­ద్ధ­రణ మా­ర్పు ప్ర­యా­ణం ప్రా­రం­భ­మైం­ద­న్నా­రు. ఈ ది­శ­ను మరింత స్ప­ష్టం­గా ముం­దు­కు తీ­సు­కె­ళ్లేం­దు­కు, ప్ర­భు­త్వం స్వ­ర్ణ ఆం­ధ్ర-2047 కా­ర్యా­చ­ర­ణ­ను ఒక స్ప­ష్ట­మైన దృ­ష్టి­లో స్థి­ర­ప­రి­చిం­ద­ని వె­ల్ల­డిం­చా­రు. భారత స్వా­తం­త్య్ర శతా­బ్ది నా­టి­కి, బల­మైన, సమ­గ్ర, ప్ర­పంచ స్థా­యి­లో పో­టీ­త­త్వం గల రా­ష్ట్రం­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­ను తీ­ర్చి­ది­ద్ద­డ­మే తమ లక్ష్య­మ­ని స్ప­ష్టం చే­శా­రు. సాంకేతికత ద్వారా, సహాయం, సమాచారం, న్యాయం పౌరులకు క్షణాల్లో చేరేలా తాము వ్యవస్థను తీర్చిదిద్దుతుని, దీనినే 'వేగవంతమైన పాలన'- స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌ అని పిలుస్తున్నట్లు వెల్లడించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదని, ప్రతి సవాలు నుంచి మరింత బలంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా మనం వేడుకగా జరుపుకుంటున్నామని చెప్పారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ