కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓ విలాసవంతమైన భవనాన్ని దుండగులు తగలబెట్టారు. బళ్లారి కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బళ్లారి నగరంలోని 'జీ స్క్వేర్ లేఅవుట్'లో సుమారు రూ. 3 కోట్ల విలువైన ఈ మోడల్ హౌస్పై దుండగులు పెట్రోల్, డీజిల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుల పనేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 1వ తేదీన జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే, ఇప్పుడు ఏకంగా భవనాన్ని తగలబెట్టడం రాజకీయ కక్ష సాధింపేనని సోమశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం బెంగళూరులో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల బ్యానర్ల వివాదం తలెత్తిన నేపథ్యంలోనే ఈ అగ్నిప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. "బళ్లారి ఎస్పీతో మాట్లాడాను, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరాను" అని ఆయన మీడియాకు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి భవనానికి నిప్పు పెట్టిన దుండగులు
السبت، 24 يناير 2026
has caused a major stir locally. Miscreants set fire to Gali Janardhan Reddy's building in Ballari national This incident which took place in the Ballari Cantonment area
ليست هناك تعليقات:
إرسال تعليق