ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో నిర్వహించిన కోడి పందెంలో ఏకంగా రూ.1 కోటి 53 లక్షల భారీ పందెం కుదిరింది. ఈ పందెం గుడివాడ ప్రభాకర్ సేతువ, రాజమండ్రికి చెందిన రమేష్ డేగ మధ్య జరిగింది. హోరాహోరీగా సాగిన పోటీలో చివరకు రాజమండ్రి రమేష్ డేగ విజయం సాధించింది. ఈ భారీ పందెన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పందెం రాయుళ్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా పందెం ప్రేమికులు భారీగా వచ్చారు. దీంతో బరులు కిటకిటలాడాయి. సంక్రాంతి కోడిపందాలు గోదావరి జిల్లాల్లో సంప్రదాయంగా నిర్వహించబడుతుండగా, ఈ ఏడాది మరింత ఉత్సాహంగా సాగుతున్నాయి. పందాల్లో వేలాది కోళ్లు నేలకొరగగా, కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. పందెం రాయుళ్లు భారీ మొత్తాల్లో పందాలు కడుతూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ, కోడిపందాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు సమాచారం.
సేతువ, డేగ మధ్య పోరు : యజమానికి రూ. కోటీ 53 లక్షలు సాధించి పెట్టిన డేగ !
الخميس، 15 يناير 2026
Andhra Pradesh tadepalligudem The clash between Sethuva and Dega The rooster that won Rs. 1.53 crore for its owner West Godavari district
ليست هناك تعليقات:
إرسال تعليق