ఇంగ్లాండ్ లోని లండన్లో రోడ్డుపై నడిచివెళుతున్న మహిళకు ప్రక్కనే పావురాల గుంపు కనిపించింది. వాటికి ఏదైనా తినిపించాలని అనిపించడంతో ఆహారం వేసింది. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లండన్లో పరిసరాల పరిశుభ్రతకు అక్కడి అధికారులు కఠిన చట్టాలు అవలంభిస్తున్నారు. అది తెలియని ఓ మహిళ పక్షులకు ఆహారం తినిపించి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే బుధవారం లండన్లో ఓ మహిళ పావురాలకు ఆహరం వేసింది. అయితే అక్కడి చట్టాల ప్రకారం రోడ్డుపై ఏదైనా పదార్థాలు వేయడం నేరం. దీంతో ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వేడుకోవడంతో 100 పౌండ్లు జరిమానా విధించి వదిలేశారు. ఈ చిత్రాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించారు. దీంతో ఇవి వైరల్గా మారాయి. అయితే లండన్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త చెదారం వేయడం నేరం. అంతేకాకుండా పెద్ద సౌండ్లతో సౌండ్బాక్సుల వాడకం అనుమతి లేకుండా కరపత్రాలు పంచడం తదితరమైన పనులన్నీ అక్కడ నేరంగా పరిగణిస్తారు. వీటికి జైలుశిక్షతో పాటు జరిమానాలు విధిస్తారు.
లండన్లో పావురాలకు మేత వేసిన మహిళ : 100 పౌండ్లు జరిమానా విధించిన పోలీసులు
الخميس، 15 يناير 2026
international offenses can result in both imprisonment and fines Police impose penalty viral on social media Woman fined £100 for feeding pigeons in London
ليست هناك تعليقات:
إرسال تعليق