ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాకు చెందిన హోంగార్డు ఎన్. శ్రీనివాసరావు ఇళ్లపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు. తనిఖీల్లో సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో నగదు, బంగారం, భూముల పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లను అధికారులు గుర్తించినట్లు సమాచారం. హోంగార్డు స్థాయి ఉద్యోగికి తెలిసిన ఆదాయానికి మించి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సమకూరాయన్న కోణంలో ఏసీబీ విచారణ చేపట్టింది. ఆస్తుల విలువ, వాటి కొనుగోలు మూలాలు, ఆదాయ వనరులపై అధికారులు సమగ్రంగా పరిశీలన చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడయ్యే అవకాశం ఉంది.
హోంగార్డు ఇళ్లపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు : రూ.20 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభ్యం ?
الخميس، 29 يناير 2026
ACB officials conduct surprise raids on Home Guard's properties Andhra Pradesh Evidence of assets worth Rs. 20 crore found? raids were carried out simultaneously at four locations
ليست هناك تعليقات:
إرسال تعليق